Namaste NRI

ఆ రెండు దేశాలకు వెళ్లేవారు జాగ్రత్త.. భారత ఎంబసీ  కీలక  సూచన

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఆ రెండు దేశాలకు ప్రయాణాలు చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, భారత ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. కాగా, కమర్షియల్‌ విమానాల రాకపోకల కోసం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు ఇటీవల తమ గగనతలాలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఉద్రిక్తతలు కొనసాగితే, గగనతలం తెరిచే ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events