అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆయన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ లో జీ20 సమావేశాలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ సమవేశాలకు భారత్ ఆదిథ్యం ఇస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీ 20 సమావేశాల్లో పాల్గొనడానికి బైడెన్ ఇండియా వస్తున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. భారత్, అమెరికా ల మధ్య 2023 గొప్ప సంతవ్సరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో , ఆంటోని బ్లింకెన్ లు కూడా ఇక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే భారత్ , అమెరికా ఫోరమ్ లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొంటారు.
