
హమాస్ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా, బందీలందరినీ విడుదల చేయడంతోపాటు, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికిగల అవకాశాల గురించి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త (శరణార్థుల వ్యవహారాలు) ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నాయి. హమాస్తో నేరుగా అమెరికా గతంలో చర్చలు జరపలేదు. హమాస్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా 1997లో ప్రకటించింది.
