Namaste NRI

 రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌

బాలీవుడ్‌ కథానాయకుడు రణవీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న చిత్రం రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ. వయాకామ్‌18 స్టూడీయోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తుమ్‌ క్యా మిలే అంట సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. కశ్మీర్‌ అందాల మధ్యలో సాగిన ఈ పాటలో రణవీర్‌, అలియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ గీతాన్ని తన గురువైన యశ్‌ చోప్రాకు అంకితం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు కరణ్‌ జోహర్‌. నేను మొదట్లో నా గురువు యశ్‌ చోప్రాకు నివాళులర్పించడానికి ఒక ప్రేమగీతాన్ని చిత్రీకరించాలని అనుకున్నాను. అనుకున్నట్లుగానే నా ఆలోచన నిజమైంది అని వ్యాఖ్యాల్ని జోడిరచారు.  కశ్మీర్‌ అందాల మధ్యలో అలియా భట్‌, రణ్‌వీర్‌ల జంట మధ్య సాగిన గీతం మైమరపించేలా ఉంది. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events