Namaste NRI

భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే 75 ఏండ్లు.. ప్రపంచ బ్యాంకు

భారత్ ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ల వ్యక్తిగత తలసరి ఆదాయం లో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత దేశానికి 75 ఏండ్లు పడుతుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మిడిల్ ఇన్‌కం ట్రాప్ నుంచి బయట పడటానికి మార్గాలపై ప్రపంచ బ్యాంక్ బ్లూ ప్రింట్ విడుదల చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతోపాటు 100కిపైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.

ప్రపంచ అభివృద్ధి నివేదిక – 2024 అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత ధోరణు లు ఇలాగే కొనసాగితే అమెరికన్ల తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి చైనాకు పదేండ్ల కు పైగా, ఇండోనేషియాకు 70 ఏండ్లు, భారత్‌కు 75 ఏండ్లు పడుతుంది. గత 50 ఏండ్ల అనుభవాల నుంచి తీసు కున్న గుణపాఠాల ప్రకారం దేశాలు సంపన్నంగా ఎదుగుతున్నాయి. కానీ అమెరికన్ వ్యక్తిగత తలసరి జీడీపీ రోజుకు 8000 డాలర్లు. ఆయా దేశాల పౌరుల తలసరి జీడీపీ పది శాతం. ఈ దేశాలన్నీ మధ్య ఆదాయ ట్రాప్ లో నే చిక్కుకున్నాయి అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వీటిని మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events