Namaste NRI

సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఊరట

సింగపూర్‌ నుంచి ఇండియాకు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర తాజాగా సవరించిన అట్‌ రిస్క్‌ దేశాల జాబితాల నుంచి సింగపూర్‌ని తొలగించింది. అదే సమయంలో కొత్తగా ఘనా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో చేర్చింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభనతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్‌ నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒమిక్రాన్‌ ప్రభావం నుంచచి దేశాల జాబితాను అట్‌ రిస్‌ పేరుతో కేంద్రం  ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్‌, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజీల్యాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, ఇజ్రాయిల్‌, హాంక్‌కాంగ్‌ దేశాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News