కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం సర్దార్. పి.ఎస్. మిత్రన్ దర్శకుడు. రాశీ ఖన్నా కథా నాయికగా నటిస్తున్నారు. రజీషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాత. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని ప్రకటించారు. టైక్నో` థ్రిల్లర్స్ని రూపొందించడంలో మంచి పేరున్న మిత్రన్ మరో ఆసక్తికరమైన కథతో తీస్తున్న చిత్రమిది. అభిమన్యుడుతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఈసారి కార్తితో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. లైలా, మునిస్కాంత్, అశ్విన్, యోగ్జాపి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్.