Namaste NRI

ఈ నెల 30న రాంగీ విడుదల

అందాల  నాయిక త్రిష నటించిన యాక్షన్‌ చిత్రం రాంగీ. ఈ చిత్రాన్ని ఈ  నెల 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా సంవత్సరం నుంచి విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఇందులోని కీలక యాక్షన్‌ ఘట్టాల కోసమే సమయం పట్టినట్లు  చిత్రవర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ కథ అందించారు. శరవణన్‌ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.   మూడేళ్ల క్రితమే షూటింగ్‌ పూర్తయింది.  ట్రైలర్‌ కూడా అప్పుడే రిలీజ్‌ చేశారు.  కానీ కరోనాతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. త్రిష చేసిన ఫైట్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయంటూన్నారు మేకర్స్‌.

Social Share Spread Message

Latest News