Namaste NRI

సెప్టెంబరులో ఆప్తా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 

 అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్తా) ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షుడు ఉదయ భాస్కర్‌ కొట్టే తెలిపారు. ఆప్తా నూతన కార్యవర్గం అట్లాంటాలో సమావేశమై 2023-2024  రోడ్‌ మ్యాప్‌పై చర్చించినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా అట్లాంటాలో పలు వేదికలను నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ  సెప్టెంబరు చివరి వారంలో నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, సాహిత్య కళాకారులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ  సమావేశంలో బోర్డు చైర్‌పర్సన్‌ సుబ్బు కోట, ఆప్తా పూర్వ అధ్యక్షులు, ఇతర బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లాంటా ఆప్తా ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events