Skip to main content

Namaste NRI

అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధిగా భారతీయ సంతతి వ్యక్తి

అమెరికా విదేశాంగ శాఖ  అధికారిక ప్రతినిధిగా వేదాంత పటేల్  బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో  తాత్కాలికంగా ప్రతినిధిగా  ఆయన కొనసాగనున్నారు. ఆ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ ఈ నెలలో రిటైర్ కానున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన వేదాంత ప‌టేల్‌కు  ఆ అవకాశం దక్కింది. తాత్కాలిక ప్రతినిధిగా వేదాంత పటేల్ పనిచేస్తారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు.  నెడ్ ప్రైస్ స్థానంలో ఇంచార్జిగా వస్తున్న వేదాంత పటేల్ ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియాలో పుట్టిన పటేల్  కాలిఫోర్నియాలో పెరిగారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. గతంలో అధ్యక్షుడు బైడెన్‌కు  అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ, ప్రతినిధిగా పటేల్ చేశారు.

Social Share Spread Message

Latest News