
జనవరి 19, 2026 నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం లభించిన రోజు అన్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క – సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.






















