Namaste NRI

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ జాతర … మంగళగిరి స్టేడియంలో మెగా పవర్ వైబ్స్

మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గ్లోబల్ స్టార్ Ram Charan ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారుల్లో నూతనోత్సహాన్ని నింపారు

ఈ సందర్భంగా క్యాపిటల్ అమరావతి వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు రామ్ చరణ్ టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ అద్భుత ఆవకాశమని పేర్కొన్నారు.

రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్… ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మైదానంలో పరుగుల సునామీ.. నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఫీవర్ మధ్య.. భారీ సంఖ్యలో అభిమానులు, క్రీడాభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ మెగా క్రికెట్ పండగలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ, కేశినేని శివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events