Namaste NRI

భారతీయ మహిళలకు అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ రిచెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ ఉమెన్‌ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్‌ జాబితాలో ఇండో అమెరికన్‌ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో అరిస్టా నెట్‌వర్క్‌ సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్‌ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి 1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. కాన్ఫ్సుయెంట్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్‌ డాలర్లు, జింగో బయో వర్క్స్‌ సహ వ్వవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్‌ డాలర్ల ఆస్తులతో వరుసగా 39వ స్థానాల్లో నిలిచారు. పెప్పికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్రనూయి 290 మిలియన్‌ డాలర్ల ఆస్తులతో 91వ స్థానంలో నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events