తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ, జనసేనలు ఇచ్చిన పిలుపు మేరకు బే ఏరియా, మౌంటైన్ హౌస్ ఎన్నారైలు కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు జగన్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొనడం విశేషం.
