అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనలను సవరిస్తూ వ్యాక్సిన్ తీసుకొని వారికి గుడ్న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోని రెసిడెంట్లు, టూరిస్టులకు తీపి కబురు చెప్పింది. కల్చరల్, టూరిస్ట్ ప్రదేశాల్లోకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు మార్చి 17 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడిరచింది. అయితే సదరు వ్యక్తులు ఆయా ప్రదేశాలను సందర్శించే కంటే 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందాలని స్పష్టం చేసింది.














