Namaste NRI

పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్న నటి శోభన

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, హీరో బాలకృష్ణ సహా పలువురు ప్రముఖులు సహా 71 మంది అవార్డులను అందుకున్నారు.

తాజాగా మిగతా వారందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. కళారంగం నుంచి నటి డాక్టర్ శోభన చంద్రకుమార్ పద్మభూషణ్‌ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ పద్మశ్రీని స్వీకరించారు. ఏపీ నుంచి వీరాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అలాగే, సామాజిక సేవరంగంలో చేసిన కృషికి సాధ్వి రితంభర పద్మ భూషణ్‌, సంగీతకారుడు రికీ కేజ్‌ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రజా వ్యవహారాల్లో చేసిన కృషికి గాను న్యాయమూర్తి (రిటైర్డ్‌) జగదీష్ సింగ్ ఖేహర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events