Namaste NRI

పాకిస్థాన్ పై విరుచుకుపడిన అమెరికా

అమెరికా మరోసారి పాకిస్థాన్‌ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 2020 ఏడాదికి గాను ప్రపంచ ఉగ్రవాదం తీరుతెన్నులపై అమెరికా తాజాగా నివేదిక విడుదల చేసింది. పాకిస్థాన్‌ కేంద్రంగానే భారత్‌ పై ఉగ్రవాదులకు కుట్రలు జరిగాయని అందులో ఆరోపించారు. పాకిస్థాన్‌ దాదాపు 12 ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారిందని వెల్లడిరచింది. ముష్కర మూకలపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవడం లేదని,  ముంబయి దాడుల సూత్రధారులపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అమెరికా వివరించింది.

                ఉగ్రవాదులు పాకిస్థాన్‌ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, వాటి అనుబంధ సంస్థలు పాక్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించింది. పాక్‌ లోని కొన్ని మదర్సాల్లో తీవ్రవాద భావజాలం నూరిపోస్తున్నారని ఆగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో అమెరికా భారత్‌ పై ప్రశంసలు కురిపించింది.. భారత్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడంలో ఎన్‌ఐఏ సమర్థంగా పనిచేస్తోందని కితాబునిచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events