Namaste NRI

ప్రయాణ ఆంక్షలను సడలించిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై ఆ దేశం ఆంక్షలను సడలించింది. తమ దేశంలో రావడానికి ముందే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపించాలని షరతు పెట్టింది. దేశంలో అడుగు పెట్టిన తర్వాత అలాంటి వారికి క్వారంటైన్‌ అవసరం ఉండదని స్పష్టం చేసింది. భారత్‌ తదితర దేశాలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మేరకు కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించింది. నవంబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.  ఈ వివరాలను శ్వేతసౌధం కొవిడ్‌ స్పందన సమస్వయకర్త జెఫ్‌ జియెంట్స్‌ వెల్లడిరచారు.

                అమెరికా వచ్చే ప్రతి వ్యక్తి నుంచి వారి ఫోన్‌ నంబరు, ఈ`మెయిల్‌, ఇతర వివరాలను సేకరించేలా విమానయాన సంస్థలకు వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) ఆదేశాలు ఇవ్వనుంది. దేశంలోకి వచ్చిన తర్వాత వీరిలో ఎవరైనా కొవిడ్‌ బారిన పడితే వారితో కాంటాక్టు అయినవారిని త్వరగా గుర్తించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. విమానాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అద్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే సూచించారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు అని జియంట్స్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events