Namaste NRI

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్

తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు.తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా అని స్మరించుకున్నారు.

సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లని నినదించిన మహోన్నత వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. యుగపురుషుని 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి ఘన నివాళులు అర్పించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events