ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వెళ్లడం గమనార్హం. రష్యా బలగాలు బాంబుల మోత కురిపిస్తున్న వేళ ఆమె లివివ్లో ప్రత్యక్షమయ్యారు. క్రమాటోర్క్స్ రైల్వేస్టేషన్పై రష్యా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఆ దాడిలో గాయపడిన చిన్నారులను ఏజెంలీనా జోలి పరామర్శించారు. క్షతగ్రాతులకు చికిత్స చేస్తున్న వాలంటీర్లతో మాట్లాడారు. అనంతరం ఆమె ఓ కేప్లోకి వెళ్లడంతో అక్కడున్నవారిని ఆశ్చపరిచారు. ఐక్యరాజ్యసమితి మానవతావాదిగా ఉన్నారు. అమెరికాకు చెందిన సెలబ్రెటీలో ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే మొదటిసారి.