కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్జీపీటీని మించేలా డీప్సీక్ ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది. క్వెన్ 2.5-మాక్స్ పేరుతో ఒక ఏఐ మాడల్ను షాంఘైలో ఆవిష్కరించింది. ప్రస్తుతం అందుబాటు ఉన్న ఏఐ మాడళ్లను మించి అత్యుత్తమంగా పని చేసినట్టు ప్రకటించింది.
