Namaste NRI

రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా.. వాన్స్‌

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును ఆమోదించారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌గా జేడీ వాన్స్‌ పేరును ట్రంప్‌ ప్రకటించారు. నవంబరులో జరగబోయే ఎన్నికకు పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. వాన్స్‌ ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నుంచి పట్టభద్రు డైన ఆయన యేల్‌ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని, మెరైన్‌ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందిం చారని, సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని సోషల్‌ మీడియాలో ట్రంప్‌ రాసుకొచ్చా రు. 2022లో మొదటి సారిగా అమెరికా సెనేట్‌కు జేడీ వాన్స్‌ ఎన్నికయ్యారు. భారత సంతతి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్‌ వివాహమాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events