Namaste NRI

డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన సివిల్‌ ఫ్రాడ్‌ కేసు విచారణ ముగింది. వచ్చే ఏడాది జనవరిలో కేసుపై తీర్పును వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ రుణదాతల ను మోసం చేయడానికి తన నికర విలువను తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఫ్రాడ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలితే,  250 మిలియన్‌ డాలర్ల భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. అదే సమయంలో న్యూయార్క్‌లో వ్యాపారం చేయకుండా నిషేధించే అవకాశాలు సైతం ఉన్నాయి.

2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న ట్రంప్‌కు ఇది పెద్ద దెబ్బలాంటిదే. అయితే, అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తున్న ట్రంప్. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమాచారం మేరకు ఫ్రాడ్‌ కేసును విచారిస్తున్న జస్టిస్‌ ఆర్థర్‌ అంగోరాన్‌ జనవరి 11న తీర్పును జనవరి 11, 2024న వెల్లడించే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events