Namaste NRI

చంద్రబాబుకు బాలయ్య.. రేవంత్‌కు బాలయ్య కుమార్తె భారీ విరాళం

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు భారీ ఎత్తున ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.

తాజాగా తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.  బాలయ్య ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించిన రూ. 50 లక్షల చెక్‌ని సీఎం చంద్రబాబుకి అందజేయగా, సిద్దు, విశ్వక్సేన్ వారు ప్రకటించిన విరాళాలను బాలయ్య సమక్షంలో చంద్రబాబుకు అందజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events