యుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర కొరియా మిలటరీ అధికారులను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంచలన ఆదేశాలు ఇచ్చారు. కుమార్తెతో కలిసి ఆర్మీ డ్రిల్స్కు హాజరైన ఆయన అసలైన యుద్ధానికి సన్నాహాలు చేయాలని తెలిపారు. ఇప్పటికే మిలిటరీ డ్రిల్ కొనసాగుతుండగా, ఇక నిజమైన వార్కు రెడీ అవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
