
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950 మద్రాస్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పుట్టిన రోజు సందర్భం గా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. 1950ల నాటి క్లాసిక్ రెట్రో లుక్తో పోస్టర్ ఆకట్టుకుంటున్నది. వినూత్నమైన పీరియాడిక్ కథాంశమిదని, నాటి ప్రజల జీవితానికి అద్దం పడుతుందని, భాగ్యశ్రీ బోర్సే పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఝను చంతర్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.
