
హైస్పీడ్ రైళ్లలో డ్రాగన్ దేశం చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్ రైలు ను పరీక్షించింది. ఈ రైలు రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రైలు వేగాన్ని చూసి అక్కడి అధికారులు, మీడియా ప్రతినిధులే ఆశ్చర్యానికి గురయ్యారు. 700 km/h వేగాన్ని అందుకున్న తర్వాత రైలును అధికారులు సురక్షితంగా ఆపగలిగారు. ఇది అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలుగా నిలిచింది.















