అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు థామస్ మేసీ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనే ఇందుకు కారణం. ఆ ఫోటోలో మేసీ కుటుంబ సభ్యులందరూ గన్నులు చేతపట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేసీ శాంటా ఈ క్రిస్మస్కు బుల్లెట్లు తీసుకురా అంటూ ట్విటర్ పోస్ట్ పెట్టారు. మిచిగన్లో ఇటీవల ఓ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే రిపబ్లికన్ నేత ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. తుపాకీ హింసకు గురైన బాధిత కుటుంబాలు థామస్ వైఖరిని ఖండిరచారు.














