Namaste NRI

ధనుష్‌ సార్‌ వచ్చే టైం ఫిక్స్‌.. కొత్త లుక్‌తో

ధనుష్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం సార్‌. సంయుక్తా మేనన్‌ కథానాయిక.  ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నార. ఈ సినిమాని డిసెంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం వాయిదా పడిరది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీతో కూడిన రెండు పోస్టర్లను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. విద్యావ్యవస్థ తీరు తెన్పులపై సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాగా. ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ స్వరాలందిస్తున్నారు. జె.యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events