సీఎన్ఎన్ నెట్వర్క్పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరవురునష్టం కేసు దాఖలు చేశారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశారు. సీఎన్ఎన్ నెట్వర్క్ తన పరువుకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్ తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. సీఎన్ఎన్ నెట్వర్క్కు తనను విమర్శించడంలో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉందని ట్రంప్ ఆరోపించారు. 2024లో జరిగే అమెరికా అద్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని నెట్వర్క్ భయపడి ఇటీవల తనపై దాడిని పెంచిందని వాజ్యంలో ఆరోపించారు. జాత్యహంకారి, రష్యన్ లూకీ, తిరుగుబాటుదారుడు.. హిట్లర్గా పేర్కొంటూ తనను అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.