Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ ప్రారంభించారు.. మేం అంతం చేస్తాం

ఇరాన్‌  లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నది.  ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది.

Social Share Spread Message

Latest News