Namaste NRI

ఈయూకు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికల పర్వం కొనసాగుతున్నది. పన్నులు తగ్గించాలని ఇటీవల భారత్‌ను హెచ్చరించిన ఆయన ఈసారి యూరోపియన్‌ యూనియన్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా-యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వాణిజ్య లోటును తగ్గించకపోతే, పన్నుల కొరడా ఝళిపిస్తానని హెచ్చరించారు.   చమురు, సహజ వాయువు అత్యధికంగా అమెరికా వద్ద కొనాలని చెప్పారు. ఈ విషయాన్ని తాను యూరోపియన్‌ యూనియన్‌కు తెలియజేశానని ట్రంప్‌ వెల్లడించారు. 2016-2020 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్‌ ఇదే వైఖరిని అవలంబించారు. యూరోప్‌ చాలా కాలం నుంచి అమెరికా వీపుపై గుర్రపు స్వారీ చేస్తున్నదన్నారు. అలా జరగడానికి అవకాశం ఇచ్చినది అమెరికాయేనని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events