Namaste NRI

జనవరిలో ఎమర్జెన్సీ

బాలీవుడ్‌ క్వీన్‌, మండి ఎంపీ కంగనా రనౌత్‌   ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం,  పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ మేరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ఎమర్జెన్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్‌ స్వయంగా ప్రకటించారు. భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి  అంటూ కంగనా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News