Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌కు ఈయూ భారీ సాయం

రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య భారీ సాయం ప్రకటించింది. నాలుగేండ్లలో రూ.4 లక్షల కోట్లు అందజేయాలని సమాఖ్యలోని 27 దేశాల అధినేతలు నిర్ణయించారు. బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశంలో సభ్య దేశాలు ఈ సాయానికి ఆమోదం తెలిపినట్టు ఈయూ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌ వెల్లడించారు. ఈయూ సాయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. సైనిక సహాయానికి ఇది ఏ మాత్రం తీసిపోదన్నారు.

Social Share Spread Message

Latest News