Namaste NRI

డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) కెనడా ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫెస్ట్

కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (డిటిసి) ఆధ్వర్యంలో కార్తీక మాసపు వనభోజనం కాన్సెప్ట్‌తో డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియం లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 800లకు పైగా తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణ రంభోట్ల, సంతోష్ కుంద్రు, యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డిటిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకుపాలెం, శివరామ్ మోహన్ పసుపులేటిల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో డి.టి.సి. కుకింగ్ షో, డి.టి.సి. కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా డిటిసి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు. భారత సాహితీ సంపద ఉత్సవాలను కెనడాలో ఘనంగా జరపడం తమ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ వేడుకలకు విచ్చేసిన డా.బాబీ యానగావా ఆరోగ్యంపై విలువైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిటిసి ఎక్సలెన్సీ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. డా.బాబీ, డా.శరత్ గుండల, డా.శ్రీవాణి గుండల చేతుల మీదుగా డిటిసి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డును ఉషా నడురికి, డి.టి.సి. ఆర్ట్స్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డును చిన్నారి సిరి వంశిక చిలువేరుకు, డి.టి.సి. ఆర్ట్స్ అండ్ సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డును చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకు అందజేసారు. ముగ్గురు అవార్డు గ్రహీతలకూ డీటీసీ తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమానికి గ్రేటర్‌ టోరంటో ఏరియా (జీటీఏ)లో పలు తెలుగు సంఘాల ప్రతినిధులు విచ్చేయగా వారిని సన్మానించారు. ఆయా సంఘాల నుంచి పాల్గొన్న వారిలో డర్హమ్ తెలుగు అసోసియేషన్ (డిటిఎ) నుండి స్వాతి మిర్యాల, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓ.టి.ఎఫ్) నుండి శ్రీ ప్రవీణ్ నీలా, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి జగపతి రాయల, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి విజయ కుమార్ కోట, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్, డర్హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్హమ్ తెలుగు క్లబ్ (డిటిఎ) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.

డీటీసీ ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ ఉ ఒషావా సౌజన్యంతో అందించారు.ఈ సందర్భంగా డీటీసీ అధ్యక్షుడు శ్రీ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించే దిశగా జీటీఏలోని అన్ని సంస్థలూ పనిచేస్తున్నాయన్నారు. తాము చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు సహకారం అందిస్తోన్న డీటీసీ కార్యకర్తలు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events