
సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం తెలుసు కదా. నీరజా కోన దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు మేకర్స్. మల్లిక గంధ అనే తొలిగీతాన్ని విడుదల చేశారు. తమన్ స్వర రచనలో సిధ్శ్రీరామ్ ఆలపించారు. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండి ఏదో మారిందా, ఎంతెంత చూ స్తున్నా ఇంకాస్త లోతుందా అంటూ చక్కటి భావాలతో పాట సాగింది. అక్టోబర్ 17న విడుదలకానుంది. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: నీరజ కోన.
















