Namaste NRI

గల్ఫ్ దేశాల్లో తొలిసారిగా.. ఒమన్‌లో

ఒమన్‌ దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ను 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే అధిక సంపాదన ఉన్న వారి నుంచి మాత్రమే ఒమన్ పన్ను వసూలు చేయాలని భావిస్తోంది.

ఏడాదికి 42 వేల రియాల్స్‌ (అంటే 1.09 లక్ష డాలర్లు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5 శాతం చొప్పున పన్ను వేయాలని ఒమన్‌ యోచిస్తోంది. దాంతో పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 1 శాతంగా ఉండవచ్చునని అంచనా వేస్తోంది. ఇనకమ్‌ ట్యాక్స్‌ అమల్లోకి వస్తే ఆదాయంపై పన్ను వేస్తున్న తొలి గల్ఫ్‌ దేశంగా ఒమన్‌ నిలువనుంది.

కాగా గల్ఫ్‌ దేశాలకు ముడిచమురే ప్రధాన ఆదాయ వనరు.  ఈ నేపథ్యంలో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఒమన్‌ భావిస్తోంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి వెచ్చించాలనుకుంటున్నట్లు ఒమన్‌ ఆర్థిక మంత్రి బిన్‌ మహ్మద్‌ అల్‌ సఖ్రి తాజాగా పేర్కొ్న్నారు. జీసీసీలోని ఇతర దేశాలకు ఒమన్‌ తీసుకున్న నిర్ణయం ఆదర్శం కావొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events