Namaste NRI

ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌ బాలికకు… జీన్‌థెరపీతో

జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్‌కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్‌ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్‌ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్‌లోని అడ్డెన్‌బ్రూక్స్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఎలాంటి వినికిడి పరికరం అవసరం లేకుండానే ఈ చిన్నారి వినగలుగుతున్నదని వైద్యులు తెలిపారు.

ఈ అధునాతన చికిత్స అందుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఈ చిన్నారి. చికిత్సలో భాగంగా ముందు చిన్నారి ఎడమ చెవిలోని కోక్లియా(కర్ణావృత్తి)కి జనరల్‌ అనెస్తీసియా ఇచ్చారు. తర్వాత వినికిడి శక్తిని పునరు ద్ధరించగలిగే జన్యు పదార్థం నకలుతో కూడిన ప్రమాదరహిత ఏఏవీ1 అనే వైరస్‌ను ఆమెకు ఇచ్చారు. ఈ వైరస్‌ శరీరంలోని కణాలకు జన్యు పదార్థాన్ని సరఫరా చేసి శరీరం నుంచి సహజంగా నిష్క్రమిస్తుంది. ఆ జన్యు పదార్థం వినికిడి శక్తిని పునరుద్ధరించేలా చేస్తుంది. ఈ చికిత్స పూర్తిగా సురక్షితమైనదని వైద్యుడు మనోహర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events