మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ మేజర్. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జీయంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , ఎ+ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో శాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి , మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హ్యూజ్ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇదిలావుండగా హీరో అడివి శేష్, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను రూపొందించినందుకు అడివి శేష్ ని అభినందించారు రామ్ నాథ్ కోవింద్. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు అభినందించి, ఆశీర్వదించారు. ఇది మేకర్స్ కి అతిపెద్ద విజయం, గర్వకారణమైన క్షణం అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-82.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-77.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-77.jpg)