బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కథానాయకులుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. ఆనంది, దివ్య పిైళ్లె కథానాయికలు. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను మేకర్స్ విడుదల చేశారు. శుక్రవారం మూడో పాటను కూడా విడుదల చేశారు. సై సై సై సై సై.. నా చీరకట్టు మీద వీణమెట్టువైతవా అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు.

ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల కలిసి ఆలపించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అదితి శంకర్లపై సాగిన డ్యూయెట్ సాంగ్ ఇది. డాన్స్ మూమెంట్స్ కొత్తగా అనిపిస్తాయి. పల్లెటూరి నేపథ్యంలో పాట సాగింది. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్, కెమెరా: హరి కె.వేదాంతం, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ.
