Namaste NRI

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..  ప్రవాసీయుల కోసం

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పంజాబ్‌లో ఎన్నారై కోర్టుల సంఖ్య పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఐదు కొత్త ఎన్నారై న్యాయస్థానాలను ఏర్పాటు చేయబోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న ఒకే ఒక ఎన్నారై కోర్టు జలంధర్‌లో ఉంది. రాష్ట్రంలో మొత్తం 2500 ఎన్నారై కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్‌ సింగ్‌ ధలీవాల్‌ పేర్కొన్నారు.  కొత్త ఎన్నారై పాలసీలో భాగంగా ప్రవాసీయులకు అన్ని రకాల సహాయలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  ఎన్నారై కమిషన్‌ ద్వారా తక్కువ సమయంలో ఎన్నారైల సమస్యల పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. ఎన్నారైల సమస్యలకు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఓ నోడల్‌ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు.  ఈ నేపథ్యంలో బఠిండా, నవాన్‌షహర్‌, పాటియాలా, హోషియార్‌పూర్‌, మోగాలో ఈ కొత్త  కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events