పవన్కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. జ్యోతికృష్ణ దర్శకత్వం. ఎ.దయాకర్రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటల్ని మేకర్స్ విడుదల చేయగా, చెన్నైలో ఘనంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమం లో సినిమాలోని నాలుగో గీతాన్ని విడుదల చేశారు. కథానాయిక నిధి అగర్వాల్, సమర్పకుడు ఏ.ఎం. రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ, నటులు సత్యరాజ్, నాజర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విజయం పట్ల వారంతా నమ్మకం వెలిబుచ్చారు.

ఇక పాట విషయానికొస్తే తార తార నా కళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు.. ఆకాశాన్ని ఎంతకనీ వెలకడతారు అంటూ సాగిన ఈ గీతాన్ని శ్రీహర్ష రాయగా, ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ అలపించారు. పవన్కల్యాణ్, నిధి అగర్వాల్పై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది. రాజుల కాలంనాటి వాతావరణాన్ని ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు.
