Namaste NRI

పురుషోత్తముడులో అమ్ములుగా అలరిస్తా : హాసినీ సుధీర్‌

రాజ్ తరుణ్ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం పురుషోత్తముడు.  హాసిని సుధీర్ హీరోయిన్‌. రామ్‌ భీమన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హాసినీ సుధీర్‌ మాట్లాడుతూ మాది మహారాష్ట్ర. హీరోయిన్‌ కావాలన్నది నా చిన్ననాటి కల. ముంబైలో మోడలింగ్‌ చేశాను.

పురుషోత్తముడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు అమ్ములు. అంతా అమ్ము అని పిలుస్తారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తెలుగు త్వరగా నేర్చుకోగలిగాను. తొలి సినిమాలోనే ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ వంటి సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా. ఈ సినిమా తెలుగులో బ్రేక్‌నిస్తుందన్న నమ్మకం ఉంది. భవిష్యత్తులో లవ్‌ స్టోరీస్‌తో పాటు యాక్షన్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నా అని చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events