వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. జూన్ 3వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో రక్షిత తో ఆయన వివాహం జరగనుంది. అక్కడి లీలా ప్యాలెస్లో వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. రెండు రోజుల పాటు పెండ్లి కార్యక్రమాలు జరపనున్నారు. జూన్ 2న మెహందీ ఫంక్షన్, మరుసటి రోజు రాత్రి 11 గంటలకు కళ్యాణానికి సుముహూర్తంగా నిర్ణయించారు. ఈ జనవరిలో శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది.ఇరు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు ఈ పెండ్లి సందడిలో పాల్గొనబోతున్నారు.


