Namaste NRI

భారతీయ వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌… ఏడాది పాటు ఉచితంగా

శామ్‌ ఆల్ట్‌మన్‌ నేతృత్వంలోని ఓపెన్‌ ఏఐ కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది. నవంబర్‌ 4 నుంచి ప్రారంభమయ్యే పరిమిత కాల ప్రమోషనల్‌ పీరియడ్‌లో రిజిష్టర్‌ చేసుకున్న వారికి చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరంపాటు ఉచితంగా అందించబోతున్నట్టు వెల్లడించింది.  భారత్‌లో తొలిసారిగా దేవ్‌డే అనే ఈవెంట్‌ను ఓపెన్‌ ఏఐ బెంగళూరులో నిర్వహించనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఈ ఆఫర్‌ కొత్త యూజర్లకు, ఇప్పటికే చాట్‌జీపీటీ గో సబ్‌స్ర్కైబర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఏడాది ఉచిత సేవలు లభిస్తాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events