ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం షష్టిపూర్తి. నాటి లేడీస్టైలర్ జంట రాజేంద్ర ప్రసాద్, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లు. పవన్ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కథానుగుణంగా షష్టిపూర్తి రోజు వచ్చే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. వేయి వేణువులనాదం మోగే హాయి హాయి హృదయాన.. ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవైలో ఇరవైలా విరిసిన వరమాల అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్ రాయగా, కార్తీక్, విభావరి ఆప్టే జోషి కలిసి ఆలపించారు.

స్వర్ణ మాస్టర్ ఈ గీతానికి నృత్య రీతుల్ని సమకూర్చారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు హైలైట్ కానున్నదని, ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందేనని, ఈ పాటకోసం లెజెండ్రీ కళాదర్శకుడు తోటతరణి నిర్మించిన మండువ లోగిలి సెట్ అద్భుతమైన అనుభూతికి లోను చేస్తుందని, రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నదని మేకర్స్ తెలిపారు. ‘కాంతార’ఫేం అచ్యుత్కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, మురళీధర్గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్, నిర్మాణం: మా ఆయి ప్రొడక్షన్స్.
