Namaste NRI

భారత్‌ కీలక నిర్ణయం…ఐరాస సమావేశానికి మోదీ

భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరు కావడం లేదని తెలుస్తోంది.

సెప్టెంబరు 9 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 80వ సెషన్‌ ప్రారంభమవుతుంది. 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో బ్రెజిల్‌ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడతారు. తర్వాత భారత మంత్రి ప్రసంగం ఉంటుందని ఐరాస తన షెడ్యూల్‌లో పేర్కొంది. దీని ప్రకారం యూఎన్‌ సమావేశాలకు మోదీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించనున్నారని సమాచారం.

Social Share Spread Message

Latest News