Namaste NRI

జో  బైడెన్ డుమ్మా… ఆ స‌ద‌స్సును ర‌ద్దు

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం లేదు. దీంతో వ‌చ్చే వారం జ‌ర‌గాల్సిన క్వాడ్ స‌మావేశాన్ని ర‌ద్దు చేశారు. ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేకుండా క్వాడ్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌లేమ‌న్నారు. అయితే హిరోషిమాలో జ‌ర‌గ‌నున్న జీ7 స‌ద‌స్సులో ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జ‌పాన్ నేత‌లు క‌లుసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. క్వాడ్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌లేకున్నా భార‌త ప్ర‌ధాని మోదీతో మాత్రం ద్వైపాక్షిక స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు అల్బ‌నీస్ తెలిపారు.   జీ7 సంప‌న్న దేశాల జాబితాలో యూకే, కెన‌డా, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్‌తో పాటు ఇండియా, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. మే 19వ తేదీ నుంచి మే 21 వ‌ర‌కు జీ7 భేటీ జ‌ర‌గ‌నున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events