తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఫీజులను నియంత్రించడం, ఆంగ్ల మాధ్యమం ద్వారా పేదలకు, సామాన్యులకు విద్య మరింత చేరువ అవుతుందన్నారు. మన ఊరు`మన బడి అనేది కేసీఆర్ ఆలోచనలకు తార్కాణం అన్నారు.. చిన్నప్పటి నుంచే ఆంగ్ల భాషల్లో చదవడం వల్ల సామాన్యులకు పై చదువులకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు.