అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయుడికి చోటు దక్కింది. ఇండో అమెరికన్ డాక్టర్ అశీష్ రaాకు కోవిడ్ 19 కో ఆర్డినేటర్ బాధ్యతలను కట్టబెడుతున్నట్టు బైడెన్ స్వయంగా ప్రకటించారు. బిహార్లోని మధుబని జిల్లా అశీష్ కుమార్ రaా స్వస్థలం. అశీష్రaాకి తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు ముందుగా కెనాడా షిప్ట్ అయ్యారు. అక్కడి నుంచి 1983లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో ఆయన పట్టా సాధించారు. బ్రౌన్ యూనివర్సిటీకి గత రెండేళ్లుగా డీన్గా పని చేస్తున్నారు.














